సెజ్ లు.. రాచరిక వ్యవస్థకు నకళ్లు (Eenadu, 12-5-2008)

Published in:  on May 14, 2008 at 12:37 pm Leave a Comment

TJF Visit To Polepally Sez on 3-05-2008 in eenadu paper

Published in:  on May 6, 2008 at 9:26 am Leave a Comment

Effects of SEZ in Mahabubnagar

 

ఉసురు తీసిన సెజ్
ఒకే గ్రామంలో 25 మంది బలి
తభూమిలోనే కూలీలైన రైతులు
ఎదురుతిరిగినవారిపై కేసులు
జైళ్లలో కుక్కిన యంత్రాంగం
అవమానంతో ఆత్మహత్యలు
జడ్చర్ల ప్రత్యేక ఆర్థిక మండలి ప్రభావం
ఈయన పేరు బాలు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద పోలేపల్లి రైతు. 16 ఎకరాల ఆసామి. ప్రత్యేక ఆర్థిక మండలి కోసం తన భూమిని సేకరించడాన్ని ప్రశ్నించినందుకు ప్రభుత్వం ఇతడిని అరెస్టుచేసి జైలుకు పంపింది. అవమాన భారంతో కుంగిపోయి మరణించాడు. ఇతడే కాదు.. పాతిక మందికిపైగా రైతులు ఇలా భూసేకరణకు బలయ్యారు. రైతులను తమ పొలంలోనే కూలీలుగా మార్చేసి వారి బతుకులను ఛిద్రం చేసిన ఓ ప్రత్యేక ఆర్థిక మండలిపై న్యూస్‌టుడే ప్రత్యేక కథనంమొన్నటిదాకా 16, 17 ఎకరాల భూస్వాములు వారు. నేడు.. తమ పొలంలోనే కూలీలుగా మారిపోయారు. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) వారి భూముల్ని మింగేసింది. కొందరి ప్రాణాలను కబళించింది. ఇంకొందరి బతుకులను ఛిద్రం చేసింది. ఒకరుకాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటికి 25 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు.. నమ్ముకున్న భూమిని కోల్పోయిన బాధను తట్టుకోలేక గుండె ఆగి కొందరు చనిపోయారు. తమ సొంత భూమిలోనే కూలీలుగా మారిన అవమానభారంతో ఇంకొందరు ప్రాణాలు తీసుకున్నారు. మరికొందరు భూమిని రక్షించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఆ అవమానంతో వారిలోనూ కొందరు మంచంపట్టి చనిపోయారు. బతికున్నవారూ తాము కోల్పోయిన భూముల్లోనే కూలీలుగా పనిచేస్తూ జీవచ్ఛవాల్లా కాలం వెళ్లదీస్తున్నారు. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు.. రాష్ట్ర రాజధానికి దగ్గర్లోని జడ్చర్ల వద్ద చోటుచేసుకుంది. ‘న్యూస్‌టుడే’ ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల దయనీయ పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూసింది.
Published in:  on May 5, 2008 at 6:44 am Leave a Comment

మార్కెట్‌ కంటే ఎక్కువే ఇచ్చాం – కలెక్టరు వివరణ

ఇష్టపూర్వక ఒప్పందం ప్రకారమే జడ్చర్లలో భూ సేకరణ
రైతుల మరణాలపై పరిశీలన చేయలేదు
మహబూబ్‌నగర్‌ కలెక్టరు వివరణ

మహబూబ్‌నగర్‌, న్యూస్‌టుడే:

 
                     మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపురం గ్రామాల్లో ఇష్టపూర్వక ఒప్పందం ప్రకారమే అభివృద్ధి కేంద్రం (గ్రోత్‌ సెంటర్‌) కోసం భూ సేకరణ చేశామని జిల్లా కలెక్టరు ఉషారాణి తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగించేలా భూ సేకరణ చేపట్టలేదని స్పష్టంచేశారు. చనిపోయిన రైతులకు సంబంధించిన సమాచారమేదీ అధికారుల వద్ద లేదన్నారు. ఆ మరణాలు ఎలా జరిగాయో.. ఎందుకు జరిగాయో పరిశీలించలేదని ఆమె శనివారమిక్కడ విలేఖరులకు తెలిపారు.
Published in:  on at 6:16 am Leave a Comment

కుమిలి.. పోయారు

జడ్చర్ల సెజ్‌ మృతులు 40 మంది!

పౌరహక్కుల సంఘం వెల్లడిసర్కారుపై ధ్వజం

జడ్చర్ల గ్రామీణం – న్యూస్‌టుడే
                కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలతో భూములు కోల్పోయి.. నానా బాధ అనుభవించి, రైతులు కుమిలిపోయి మరణిస్తున్నారని, దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇవి తమ నిజ నిర్ధారణలో తేలిన అంశాలని పౌర హక్కుల సంఘం పేర్కొంది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం నిజనిర్ధారణ బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. పోలేపల్లి, గుండ్లగడ్డ తండాలకు వెళ్లి.. రైతు కుటుంబాలను పరామర్శించారు. సంఘం సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రఘునాథ్‌, లింగయ్య, నారాయణరావు, లక్ష్మణ్‌ తదితరులు వారితో మాట్లాడారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించారు.

(more…)

Published in:  on at 6:03 am Leave a Comment

నేడు సెజ్‌పై కలెక్టరేట్‌ ముట్టడి

 

జడ్చర్ల, ఏప్రిల్‌ 27 (న్యూస్‌టుడే):

                పోలేపల్లి సెజ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడిస్తున్నట్లు భాజపా జాతీయ కిసాన్‌ మోర్చా సభ్యుడు డా.శౌరీ తెలిపారు. ఆదివారం జడ్చర్ల భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

(more…)

Published in:  on at 5:48 am Leave a Comment